K Hoysala | ఇటీవలే కాలంలో గుండెపోటు (heart attack) మరణాలు కలచివేస్తున్నాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా అనేకమంది ప్రజలు గుండెపోటుతో చనిపోతున్నారు. అంత వరకూ బానే ఉన్న వాళ్లు ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా గుండెపోటు కారణంగా ఓ యువ క్రికెటర్ (Former Karnataka cricketer) మరణించాడు.
కర్ణాటక మాజీ క్రికెటర్ కే.హోయసల (K Hoysala) గుండెపోటుతో కన్నుమూశాడు. కేవలం 34 ఏళ్ల వయసులోనే అతడు మైదానంలోనే కుప్పకూలి చనిపోయాడు. ‘ఏజిస్ సౌత్ జోన్ టోర్నమెంట్’ (Aegis South Zone tournament)లో భాగంగా బెంగళూరులోని ఆర్ఎస్ఐ క్రికెట్ మైదానంలో తమిళనాడు, కర్ణాటక మధ్య మ్యాచ్ ముగిసిన అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ గెలిచిన కర్ణాటక ఆటగాళ్లు సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. ఆ సమయంలో తీవ్రమైన ఛాతినొప్పితో హోయసల మైదానంలోనే కుప్పకూలిపోయాడు.
గమనించిన తోటి ఆటగాళ్లు, సిబ్బంది హుటాహుటిన అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే హోయసల గుండెపోటు కారణంగా మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషాద ఘటన ఫిబ్రవరి 22న జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు క్రికెటర్లు, అభిమానులు హోయసల మృతికి సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. కాగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా, బౌలర్గా అండర్-25 విభాగంలో కర్ణాటక జట్టుకు హోయసల ప్రాతినిధ్యం వహించాడు. కర్ణాటక ప్రీమియర్ లీగ్లో కూడా ఆడాడు.
Also Read..
Ranchi Test: రాబిన్సన్ హాఫ్ సెంచరీ.. రెండు వికెట్లు తీసిన జడేజా
Ind Vs Eng Test | ఆకాశ్ అదుర్స్.. ఎట్టకేలకు బ్యాట్ ఝళిపించిన ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్
CCL | హైదరాబాద్లో సెలబ్రెటీ క్రికెట్ లీగ్.. ముస్తాబవుతున్న ఉప్పల్ స్టేడియం