CCL | హైదరాబాద్, ఆట ప్రతినిధి: సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)కు ఆతిథ్యమిచ్చేందుకు ఉప్పల్ స్టేడియం ముస్తాబవుతున్నదని హైదరాబాద్ క్రికెటస్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు వెల్లడించారు. ఈ లీగ్ తొలి అంచె పోటీలు షార్జాలో జరుగుతుండగా.. వచ్చే నెల 1 నుంచి 3 వరకు రెండో అంచె మ్యాచ్లకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ లీగ్లో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, సాండిల్వుడ్కు చెందిన పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు.
ఈ మ్యాచ్లకు కళాశాల విద్యార్థులను ఉచితంగా అనుమతిస్తామని హెచ్సీఏ అధ్యక్షుడు తెలిపారు. ప్రతి రోజు 10 వేల మంది కాలేజీ విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తామని వెల్లడించారు. ఆసక్తి గల కళాశాలల యాజమాన్యం హెచ్సీఏను సంప్రదించాలని పేర్కొన్నారు. లీగ్లో భాగంగా హైదరాబాద్లో మొత్తం 6 మ్యాచ్లు జరగనున్నాయి. తెలుగు వారియర్స్ జట్టుకు అక్కినేని అఖిల్ సారథిగా వ్యవహరిస్తున్నాడు.