రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో వారం రోజులపాటు పూర్తి స్థాయిలో లాక్డౌన్ విధించనున్నారు. జిల్లాలో కరోనా వ్యాప్తిని నిలువరించడానికి ఈ నెల 6 నుంచి 14వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తున్నట్లు దుర్గ్ జిల్లా కలెక్టర్ సర్వేశ్వర్ భూరే తెలిపారు. ఇప్పటికే జిల్లాలో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉన్నది.
దుర్గ్తోపాటు బస్తర్, మహాసముంద్, రాజ్నంద్గావ్, రాయగఢ్, రాయ్పూర్, కొరియా, సుక్మా జిల్లాల్లో గత మంగళవారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లో చేస్తున్నారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలుచేస్తున్నారు.
ఛత్తీస్గఢ్లో నిన్న 4617 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,53,804కు చేరింది. ఇందులో 3,20,613 మంది కరోనా నుంచి కోలుకోగా, 28,987 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 4204 మంది మరణించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..