Vir Das | దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) సేవలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న ఈ మధ్య విమానంలో విరిగిపోయిన సీటును తనకు కేటాయించారంటూ కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఎయిర్ ఇండియాపై మండిపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా ఎయిర్ ఇండియా సేవలపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) సైతం అసహనం వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా విమానాలు సమయానికి (Flight Delay) రావట్లేదని ఆమె ఆరోపించారు. తాను గంటలకుపైగా వేచి ఉండాల్సి వచ్చిందంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇలా ఏదో ఒక వివాదంతో సంస్థ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఇప్పుడు ఓ కమెడియన్ కూడా ఎయిర్ ఇండియా సేవలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ప్రముఖ కమెడియన్ వీర్ దాస్ (Vir Das) ఇటీవలే తన భార్యతో కలిసి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి ప్రయాణించారు. అయితే, ఆ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. విమానం రెండు గంటలు ఆలస్యమైనట్లు చెప్పారు. ఒక్కో సీటు కోసం రూ.50,000 చెల్లించినప్పటికీ తమకు విమానంలో విరిగిన టేబుల్, విరిగిన లెగ్ రెస్ట్లు, వంగిపోయిన సీటు కేటాయించారన్నారు. ఈ ప్రయాణం మొత్తం దుర్భరంగా సాగిందని పేర్కొన్నారు. తన భార్య కాలు విరగడంతో ఆమెకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా ముందుగానే వీల్ చైర్ (Wheelchair) సర్వీసు బుక్ చేసుకున్నప్పటికీ సిబ్బంది దాన్ని తమకు సమకూర్చలేదని ఆరోపించారు. నాలుగు బ్యాగులు మోస్తూ సాయం చేయమని సిబ్బందిని అడిగితే ఒక్కరూ పట్టించుకోలేదని ఆరోపించారు.
Dear @airindia Please reclaim your wheelchair. I’m a lifetime loyalist. I believe you’ve got the nicest cabin crew in the sky, this post pains me to write. My wife and I book Pranaam and a wheelchair because she’s got a foot fracture that’s still healing. We’re flying to delhi.…
— Vir Das (@thevirdas) April 14, 2025
Also Read..
Donald Trump | అణ్వాయుధాలను మర్చిపోండి.. లేదంటే : ఇరాన్కు ట్రంప్ సీరియస్ వార్నింగ్
Sudan | సూడాన్లో ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ బలగాల దాడులు.. 300 మంది పౌరులు మృతి
Robert Vadra | మనీలాండరింగ్ కేసు.. రాబర్ట్ వాద్రాకు ఈడీ సమన్లు