ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓ కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. పంజాబ్ విద్యుత్ అధికారులతో సీఎం కేజ్రీవాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లేని సమయంలో ఈ సమావేశం జరిగింది. దీంతో కేజ్రీవాల్పై ప్రతిపక్షాలు ఓ రేంజ్లో విరుచుకుపడ్డాయి. ఆయన ఓ రిమోట్ కంట్రోల్ అంటూ విరుచుకుపడ్డాయి. ఈ విషయంపై పీసీసీ మాజీ అధ్యక్షుడు సిద్దూ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా విరుచుకుపడ్డారు. సీఎం భగవంత్ మాన్ లేని సమయంలో సీఎం కేజ్రీవాల్ ఐఏఎస్ అధికారులతో సమావేశమయ్యారు. దీనిని బట్టి అరవింద్ డీఫ్యాక్టో సీఎం అని తేలిపోయింది. ఢిల్లీ రిమోట్ కంట్రోల్ అని స్పష్టమైపోయింది. ఫెడరలిజాన్ని కేజ్రీవాల్ అవమానించారు. అటు సీఎం, ఇటు కేజ్రీవాల్ ఇద్దరూ దీనిపై వివరణ ఇవ్వాలి అని పీసీసీ మాజీ చీఫ్ సిద్దూ డిమాండ్ చేశారు.
चलने दो आंधियाँ हकीकत की, न जाने कौन से झोंके से बहरूपियों के मुखौटे उड़ जाएं
Punjabs IAS officers summoned by @ArvindKejriwal in CM @BhagwantMann’s absence. This exposes the Defacto CM & Delhi remote control. Clear breach of federalism, insult to Punjabi pride. Both must clarify— Navjot Singh Sidhu (@sherryontopp) April 12, 2022
ఇక పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా స్పందించారు. ఇదో అత్యంత దారుణమైన సంఘటన అని విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ పంజాబ్ను తన గుప్పిట్లోకి తీసుకున్నారని ఆరోపించారు. ఇలా జరుగుతుందని తాము ముందే ఊహించామని, సీఎం భగవంత్ మాన్ ఓ రబ్బర్ స్టాంప్ అని విరుచుకుపడ్డారు. ఇలా సీఎం లేని సమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సమావేశం నిర్వహించడంతో ఇది మరింత రూఢీ అయ్యిందని కెప్టెన్ అమరీందర్ అన్నారు.
Worst was feared, worst happened. @ArvindKejriwal has taken over Punjab much before it was expected to happen. That @BhagwantMann is a rubber stamp was a foregone conclusion already, now Kejriwal has proved it right by chairing Punjab officers' meeting in Delhi.
— Capt.Amarinder Singh (@capt_amarinder) April 12, 2022
స్పందించిన ఆప్
పంజాబ్ విద్యుత్ అధికారులతో సీఎం కేజ్రీవాల్ భేటీ అవ్వడాన్ని అధికార ఆప్ సమర్థించుకుంది. ఆయన తమ జాతీయ నేత అని చెప్పుకొచ్చింది. కేజ్రీవాల్ మా నేషనల్ కన్వీనర్. ఆయన మార్గదర్శకాలను ఎప్పటికీ తీసుకుంటాం. పంజాబ్ నిర్మాణాత్మక అభివృద్ధి కోసం విద్యుత్ అధికారులతో కేజ్రీవాల్ సమావేశమయ్యారు. దీన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టకూడదు. నిజానికి అభినందించాలి అని ఆప్ నేత మల్వీందర్ సింగ్ అన్నారు.