న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్టణం ఉండబోతుందని ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ డిప్లమాటిక్ అలియన్స్ మీట్లో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఏపీ రాజధానిగా అమరావతి ఉన్న విషయం తెలిసిందే. డిప్లమాటిక్ మీట్కు హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ.. విశాఖపట్టణం మా రాష్ట్రానికి కొత్త రాజధాని కాబోతున్నదని, ఆ పట్టణానికి మీరంతా రావాలని ఇన్విటేషన్ ఇస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే తాను కూడా విశాఖకు షిఫ్ట్ కాబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఏపీతో బిజినెస్ చేసేందుకు మీరంతా రాష్ట్రానికి రావాలని ఆయన ఆహ్వానం అందించారు.
#WATCH | "Here I am to invite you to Visakhapatnam which will be our capital in the days to come. I will also be shifting to Visakhapatnam in the months to come": Andhra Pradesh CM YS Jagan Mohan Reddy at International Diplomatic Alliance meet in Delhi pic.twitter.com/wANqgXC1yP
— ANI (@ANI) January 31, 2023