బీజింగ్ : ప్రధాని నరేంద్ర మోదీ (Modi US Tour) అమెరికా పర్యటనకు ముందు చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. చైనా ఆర్ధిక ప్రగతిని అడ్డుకునేందుకే భారత్ను అమెరికా అడ్డుపెట్టుకుంటోందని అడ్డగోలు వ్యాఖ్యలు చేసింది. అమెరికా భౌగోళిక రాజకీయ లెక్కలతోనే భారత్తో ఆర్ధిక వాణిజ్య బంధాలను పటిష్టం చేసుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నదని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఎడిటోరియల్ అక్కసు వెళ్లగక్కింది.
అమెరికా ఇచ్చే హామీలకు కట్టుబడి ఉండదని చైనా అత్యున్నత దౌత్యవేత్త వాంగ్ యి పేర్కొన్నారు. చైనాకు వ్యతిరేకంగా జరిపే బల్క్వార్లో భారత్ను అమెరికా ఉపయోగించుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా భోగోళిక రాజకీయ లెక్కలను అర్ధం చేసుకోవడం కష్టమేమీ కాదని, చైనా ఆర్ధికాభివృద్ధిని కుంటుపరిచేందుకే భారత్తో వాణిజ్య సహకారానికి అమెరికా మొగ్గుచూపుతున్నదని చైనా మాజీ విదేశాంగమంత్రి వాంగ్ యి చెప్పుకొచ్చారు.
అంతర్జాతీయ సరఫరా చైన్లో చైనా స్ధానాన్ని భారత్ సహా మరే దేశం భర్తీ చేయలేనందున అమెరికా భౌగోళిక రాజకీయ లెక్కలు విఫలమవుతాయని అన్నారు. బీజింగ్కు వ్యతిరేకంగా భారత్ను ఎగదోసే ఆటలు ఫలించబోవని డ్రాగన్ పేర్కొంది.
Read More :
Maharashtra | ‘మహా’ బీజేపీ, ఎన్సీపీలకు షాక్.. గులాబీ పార్టీలోకి బీడ్, ఔరంగాబాద్ నేతలు..