Char Dham Yatra | ప్రముఖ పుణ్యక్షేత్రాలు కేదార్ నాథ్, బద్రీనాథ్ కు వెళ్లే మార్గంలో ప్రతికూల వాతావరణం (Weather Conditions) కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చార్ ధామ్ యాత్ర (Char Dham Yatra)కు బ్రేక్ పడింది. ముందు జాగ్రత్త చర్యగా యాత్రను నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. వర్షం, మంచు కురుస్తున్న నేపథ్యంలో యాత్రను ఆపేయాలంటూ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) ఇచ్చిన ఆదేశాల మేరకు యాత్రను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
‘ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం చార్ ధామ్ యాత్రను నిలిపివేసింది. వారం రోజులుగా కురుస్తున్న మంచు, వర్షం కారణంగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. యాత్రకు వచ్చే ప్రయాణికులు వాతావరణం అనుకూలించిన తర్వాత తమ యాత్రను కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని సీఎం ధామి తెలిపారు.
కాగా, రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో టెహ్రీ గర్వాల్, డెహ్రాడూన్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Also Read..
Air India | మరోసారి మలమూత్ర విసర్జన ఘటన.. వ్యక్తి అరెస్ట్
Indian Army: మణిపూర్ మహిళలకు విజ్ఞప్తి.. వీడియో రిలీజ్ చేసిన ఆర్మీ
UP Encounter: యూపీలో ఎన్కౌంటర్.. వాంటెడ్ క్రిమినల్ కాల్చివేత