Air India | ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) గత కొన్ని రోజులుగా తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఇటీవల మూత్ర విసర్జన (urinate) ఘటనలతో తరచూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది.
ముంబై నుంచి ఢిల్లీ వెళుతున్న ఓ ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు తన సీట్లోనే మలమూత్ర విసర్జన చేశాడు. జూన్ 24న ఏఐసీ 866 విమానంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సీటు నంబర్ 17ఎఫ్లో ప్రయాణిస్తున్న రామ్ సింగ్ అనే వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు చెప్పారు. విమానంలోని 9వ వరుసలో కూర్చున్న అతడు సీటులో మలమూత్ర విసర్జన చేయడంతో పాటు ఉమ్మివేశాడు. అతడి తీరుతో తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. అనంతరం సిబ్బందికి ఫిర్యాదు చేశారు.
దీంతో విమాన సిబ్బంది అతడిని హెచ్చరించి.. ఇతర ప్రయాణికులకు దూరంగా కూర్చోబెట్టారు. విమానం ఢిల్లీలో ల్యాండ్ అవగానే సెక్యూరిటీ సిబ్బంది సదరు వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు అతనిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Also Read..
Indian Army: మణిపూర్ మహిళలకు విజ్ఞప్తి.. వీడియో రిలీజ్ చేసిన ఆర్మీ
Kamal Haasan | డీఎంకే ఎంపీ కనిమొళి టికెట్ వివాదం.. షర్మిలకు కారు గిఫ్ట్ ఇచ్చిన కమల్ హాసన్
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి 12గంటల సమయం