Ayodhya Ram Temple | యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh)లోని అయోధ్య (Ayodhya)లో చేపట్టిన రామ మందిరం (Ayodhya Ram Mandir) నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం సాగుతోంది. ప్రస్తుతం ఆలయ శిఖరం వద్ద పనులు జరుగుతున్నాయి. గర్భగుడి నిర్మాణం పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గర్భగుడి (Sanctum Sanctorum)కి సంబంధించిన ఫొటోలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర (Shri Ram Janmabhoomi Teerth Kshetra) ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ (Champat Rai ) తాజాగా రిలీజ్ చేశారు. ‘శ్రీ రాంలాలా గర్భగుడి దాదాపు సిద్ధమైంది. లైటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు మీతో పంచుకుంటున్నా’ అంటూ ఎక్స్ ద్వారా ఫొటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
మరోవైపు రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. జనవరిలో ఈ ఆలయం భక్తులకు అందుబాటులోకి రానుంది. పది రోజుల పాటు జరిగే ప్రతిష్ఠ ఉత్సవాలు వచ్చే ఏడాది జనవరి 16న ప్రారంభమవుతాయి. ఆలయ గర్భగుడిలో రాముని విగ్రహ ప్రతిష్ఠను 2024 జనవరి 22 మధ్యాహ్నం 12.45-1.00 గంటల మధ్య నిర్వహించనున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా విచ్చేయునున్నారు. ఇక ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి మొత్తం 6,000 మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది.
प्रभु श्री रामलला का गर्भ गृह स्थान लगभग तैयार है। हाल ही में लाइटिंग-फिटिंग का कार्य भी पूर्ण कर लिया गया है। आपके साथ कुछ छायाचित्र साझा कर रहा हूँ। pic.twitter.com/yX56Z2uCyx
— Champat Rai (@ChampatRaiVHP) December 9, 2023
Also Read..
KCR | శస్త్రచికిత్స తర్వాత వాకర్ సాయంతో నడిచిన కేసీఆర్
BRS MLC | ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన పల్లా, కడియం, పాడి కౌశిక్ రెడ్డి
PM Modi | ప్రపంచంలోకెల్లా అత్యధిక ప్రజామోదం గల నేతలు ఎవరంటే..?