BRS MLC | ఎమ్మెల్సీ పదవులకు పలువురు బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) రాజీనామా చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy), కడియం శ్రీహరి (Kadiyam Srihari), పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) ఎమ్మెల్సీలుగా నేడు రాజీనామా చేశారు (resigned from the posts of MLC). ఈ మేరకు రాజీనామా లేఖలను శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అందజేశారు. వీరి రాజీనామాలను మండలి చైర్మన్ ఆమోదించారు.
ఇటీవలే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వీరు ముగ్గురూ ఎమ్మెల్యేలుగా గెలిచిన విషయం తెలిసిందే. జనగామ, స్టేషన్ ఘన్పూర్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా వీరు ఎన్నికయ్యారు. నిబంధనల ప్రకారం 15 రోజుల్లోపు ఏదో ఒక సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఖాళీ అయిన ఈ స్థానాలకు ఎన్నికల కమిషన్ ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తుంది.
👉🏻శాసన మండలి సభ్యత్వానికి నేడు రాజీనామా చేశాను
👉🏻శాసనసభ సభ్యుడిగా చివరి శ్వాస వరకు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు తోడుగా ఉంటా
జై భారత్ ! జై తెలంగాణ!! జై కేసీఆర్ !!!@BRSparty @KTRBRS pic.twitter.com/rEzvQiNIjq
— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) December 9, 2023
*ఎమ్మెల్సీకి పల్లా రాజీనామా*
*-శాసన మండలి చైర్మన్ కి రీజైన్ లెటర్ అందచేత*
*-రెండు సార్లు అవకాశం కల్పించిన పట్టభద్రులకు కృతజ్ఞతలు**జనగామ :*
వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యే గా విజయం… pic.twitter.com/9dHeG64Kyg— Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS) December 9, 2023
Also Read..
KCR | శస్త్రచికిత్స తర్వాత వాకర్ సాయంతో నడిచిన కేసీఆర్
KCR | బీఆర్ఎస్ఎల్పీ లీడర్గా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక
Telangana Assembly | తెలంగాణ శాసనసభ 14వ తేదీకి వాయిదా