NewsClick | చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఆ దేశం నుంచి నిధులు స్వీకరించినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ (NewsClick )పై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తాజాగా కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ (Prabir Purkayastha) ఇల్లు, కార్యాలయంలో సీబీఐ (CBI) అధికారులు సోదాలు చేపట్టారు. బుధవారం ఉదయం ప్రబీర్ నివాసానికి, ఆఫీసుకు చేరుకున్న సీబీఐ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపడుతున్నారు.
కాగా, ఈ న్యూస్ పోర్టల్కు చైనా (China) నుంచి నిధులు అందుతున్నాయంటూ ఇటీవలే వచ్చిన ఆరోపణలు నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఉగ్రవాద వ్యతిరేక చట్టం (యూఏపీఏ) కింద న్యూస్క్లిక్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విభాగం అధికారులు గత మంగళవారం స్థానికంగా ఉన్న న్యూస్క్లిక్ కార్యాలయంతోపాటు సంస్థలో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టుల (Journalists) ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ సహా ఏకకాలంలో దాదాపు 30 ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టి పెద్ద ఎత్తున ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సంస్థ కార్యాలయాన్ని సీజ్ చేశారు. సంస్థ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థను అరెస్ట్ చేశారు. ఆయనతోపాటు సంస్థ హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
Also Read..
Mobile Phones Stolen | మ్యూజిక్ ఫెస్ట్లో డజన్ల కొద్దీ మొబైల్ ఫోన్స్ చోరీ..!
Vladimir Putin | ఇజ్రాయెల్-హమాస్ హింసాకాండ.. అమెరికా పాలసీ వైఫల్యమే కారణమన్న పుతిన్
Israel-Hamas War | హమాస్పై పైచేయి.. గాజా సరిహద్దు ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్