తుర్కపల్లి, జూన్ 23: ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజెపీ నాయకులు బూటకపు ధర్నా లకు దిగడం సిగ్గుచేటు అని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మ న్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేం ద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ పనిలేని కాంగ్రెస్, బీజెపీ నాయకులు మీడియాలో కనిపించేందుకే ధర్నాలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీ ఆర్ వాసాలమర్రి గ్రామ సభలో ఆ ప్రాంత అభివృద్ధిపై ఏ ప్ర కటన చేస్తారోనని భయానికి లోనయ్యారన్నారు. ఆలేరుకు ని ధులు ప్రకటిస్తే ఉనికిని కోల్పోతామని భయపడి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని కాంగ్రెస్ నాయకులు దర్శించుకుని తు ర్కపల్లికి వచ్చి ప్రొటోకాల్ పాటించలేదని ధర్నా చేయడం నీతి మాలిన చర్య అని అన్నారు. ఈ ప్రాంతం బాగుపడాలనే ఆలో చన ఆ రెండు పార్టీలకు ఏ కోశాన లేదన్నారు. ప్రొటోకాల్ వి షయంలో అధికారులు అందరికీ సమాచారం ఇచ్చారన్నారు. భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకట్రెడ్డి పార్టీ అధ్యక్ష పదవి కోసం వారంరోజులుగా ఢిల్లీలో తిరుగుతూ.. ప్రొటోకాల్ పా టించలేదని అనడం సిగ్గుచేటు అన్నారు.
ఈ ప్రాంత అభివృద్ధికి ఒక నయా పైసా అయిన విడుదల చేశాడా అని ప్రశ్నించారు. నాబార్డు నిధులు వస్తే ఆ నిధులు మావేనని చెప్తాడని, ఆయన మాటలన్ని అబద్దాలేనని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకు లు నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వమని ఎవరూ అడుగలేదని ఈ ప్రాంతంపై ఉన్న ప్రేమతోనే సీఎం కేసీఆర్ స్వ యంగా నిధులు ప్రకటించారన్నారు. వాసాలమర్రి గ్రామం రా నున్న రోజుల్లో ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంటుందని ఈ గ్రామాన్ని ఇతర గ్రామాలు ఆదర్శంగా తీసుకుంటాయన్నారు. వాసాలమర్రి గ్రామ సభ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఈ ప్రాంత ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ యంత్రాంగానికి ప్రజా ప్రతినిధులు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధం గా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలోని 421 గ్రామ పంచాయతీ లకు రూ.25లక్షల చొప్పున భువనగిరి మున్సిపాలిటీకి రూ. కోటి, మిగిలిన 5 మున్సిపాలిటీలకు రూ.50లక్షల చొప్పున ని ధులు మంజూరు చేయడంపై ఆయనకు కృతజ్ఞతలు తెలిపా రు. సమావేశంలో ఎంపీపీ భూక్యా సుశీల, జడ్పీ వైస్ చైర్మన్ భీకూనాయక్, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహరెడ్డి, టీఆ ర్ఎస్ మండలాధ్యక్షుడు పడాల శ్రీనివాస్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.