Karnataka | ఓ కారును ట్రక్కు కొన్ని కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన కర్ణాటక (Karnataka) రాష్ట్రం ఉడిపి (Udupi)లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
సాగర్ నుంచి మంగళూరు (Mangalore) వైపు వెళ్తున్న ఓ కారు వేగంగా వెళ్తూ.. టిప్పర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. అనంతరం ట్రక్కు కింద కారు ఇరుక్కుపోయింది. ఈ క్రమంలో ట్రక్కు కారును అలానే రెండు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. కారులో ఉన్న వ్యక్తి వాహనాన్ని ఆపమని ఎంత అరిచినా ట్రక్కు డ్రైవర్ అలానే ముందుకు పోనిచ్చాడు. ఇదంతా గమనించిన స్థానికులు టిప్పర్ లారీని వెంబడించి అడ్డుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
Also Read..
America | చెల్లిని తుపాకీతో కాల్చి చంపిన మూడేళ్ల చిన్నారి..!
Taapsee Pannu | నేనేమీ ప్రెగ్నెంట్ కాదు.. పెళ్లిపై తాప్సీ బోల్డ్ కామెంట్స్
Heart Surgery | రోజుల బిడ్డకు గుండె ఆపరేషనా? పసిబిడ్డకు శస్త్రచికిత్స అవసరమా?