Robert Vadra | హర్యానా (Haryana) భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు (Money laundering case) విచారణ నిమిత్తం కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ (Wayanad MP) ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) ఇవాళ వరుసగా మూడోరోజు ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన వెంట ప్రియాంక కూడా ఈడీ కార్యాలయం వరకు వెళ్లారు.
కాగా ఈ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి వాద్రా ఈడీ మంగళవారం నోటీసులు జారీ చేసి తమముందు హాజరుకావాలని ఆదేశించింది. నోటీసులు అందిన వెంటనే ఆయన నడుచుకుంటూ ఈడీ కార్యాలయానికి వెళ్లారు. దాదాపు ఐదు గంటలపాటు ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. బుధవారం కూడా హాజరుకావాలని ఆదేశించడంతో ఆయన రెండో రోజు కూడా ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఇవాళ మూడో రోజు కూడా విచారణకు వెళ్లారు. తన నివాసం నుంచి భార్య ప్రియాంకతో కలిసి వాద్రా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం లోపలికి వెళ్లిపోయారు.
ఇదిలావుంటే ఈడీ ప్రకారం.. వాద్రా కంపెనీ 2008 ఫిబ్రవరిలో గుర్గావ్లోని షికోపూర్లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్ ప్రాపర్టీ నుంచి కొనుగోలు చేసింది. దీని విలువ రూ.7.5 కోట్లు. ఆ తర్వాత వాద్రా కంపెనీ ఆ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన డీఎల్ఎఫ్కు రూ.58 కోట్లకు విక్రయించింది. డీఎల్ఎఫ్కు రూ.58 కోట్ల భారీ లాభంతో విక్రయించడంతో మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈడీ విచారిస్తోంది.
#WATCH | Delhi: Businessman Robert Vadra folds his hands, waves at media and shows a thumbs-up sign as he enters the ED office for the third consecutive day in connection with the Gurugram land case.
His wife, Congress MP Priyanka Gandhi Vadra is also with him. pic.twitter.com/HANE8tfzbr
— ANI (@ANI) April 17, 2025
Also Read..
ATM on Train | ఇక రైళ్లలోనూ ఏటీఎం సేవలు!.. పంచవటి ఎక్స్ప్రెస్లో ప్రారంభం
Justice BR Gavai | తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్