Live Wire | ఉత్తరప్రదేశ్ ( Uttar Pradesh)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హై టెన్షన్ విద్యుత్ వైర్లను తాకడంతో ఓ ఆర్టీసీ బస్సు (Bus Goes Up In Flames)లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఘాజీపూర్ (Ghazipur) జిల్లాలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు సుమారు 30 మంది ప్రయాణికులతో మహాహర్ పట్టణానికి వెళ్తోంది. మార్దా పట్టణ సమీపంలోకి రాగానే బస్సు హై టెన్షన్ విద్యుత్ వైర్లను తాకింది. దీంతో బస్సుకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అవి కొద్దిసేపటికే బస్సుమొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ఘోర ప్రమాదంలో సుమారు ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
గమనించిన స్థానికులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. మంటలు అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమించారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
बारात से वापस आ रही बस पर आज बिजली का तार गिरने से गाजीपुर, उत्तर प्रदेश मे बड़ा हादसा,
दर्जनों की जान जाने की खबर, दुखद!!#ghazipur @Uppolice @myogiadityanath pic.twitter.com/6DcBwdnsUG
— विशु _हिंदुस्तानी 🇮🇳 (@Vishu_4UU) March 11, 2024
गाजीपुर में बस में करेंट उतरने से आग लगी। 20 से ज्यादा लोग सवार थे। सीएनजी बस कोपागंज से बारात लेकर गाजीपुर के मरदह के महाहर आ रही थी।#Ghazipur #BusFire @Uppolice pic.twitter.com/w5JyZTVE7O
— Naval Kant Sinha | नवल कान्त सिन्हा (@navalkant) March 11, 2024
Also Read..
Train | రైల్లో సీటు కోసం గొడవ.. వ్యక్తి కాలర్ పట్టుకొని దుర్బాషలాడిన తల్లీకూతుళ్లు.. VIDEO
Upasana | అయోధ్య రామ మందిరాన్ని సందర్శించిన మెగా కోడలు ఉపాసన
Inayat Vats | 20 ఏళ్ల క్రితం తండ్రి మరణం.. ఆయన యూనిఫాం ధరించి ఆర్మీలో చేరిన యువతి