(BSF Raising Day) జైపూర్ : సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) రైజింగ్ డే వేడుకలు ఆదివారం ఉదయం రాజస్థాన్లోని జైసల్మేర్లో ఘనంగా నిర్వహించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాజస్థాన్ వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్షా.. ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బీఎస్ఎఫ్ గార్డ్ ఆఫ్ ఆనర్ను స్వీకరించారు. బీఎస్ఎఫ్ టోపీ ధరించిన అమిత్షా.. ఆర్మీ జవాన్లతో ముచ్చటిస్తూ సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. ఈ ఉత్సవాలకు మరో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కూడా హాజరయ్యారు. అమిత్షా, షెకావత్కు బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ పంకజ్ సింగ్ సాదరంగా స్వాగతం పలికారు.
తొలిసారిగా బీఎస్ఎఫ్ రైజింగ్ డే వేడుకలు ఢిల్లీ ఆవల జరుగుతున్నాయి. అంతకుముందు శనివారం హోంమంత్రి అమిత్ షా జైసల్మేర్లోని తనోత్ మాతా ఆలయానికి చేరుకున్నారు. ఇక్కడ ఆయన తనోత్ మాతను దర్శనం చేసుకొని పూజలు జరిపారు. శనివారం సాయంత్రం అంతర్జాతీయ సరిహద్దులోని బీఎస్ఎఫ్ పోస్ట్ నుంచి బైనాక్యులార్స్ ద్వారా సూర్యాస్తమయాన్ని వీక్షించారు. ఫార్వర్డ్ ఫోస్ట్ వద్ద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి.. బీఎస్ఎఫ్ క్యాంప్లో జవాన్లతో కలిసి విందారగించారు.
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే, ఒకసారి ఆలోచించండి..!
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
ఈ ‘ముక్కు’ రోగాలను పసిగడుతుంది.. ఎలాగంటే?
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..