Parliament Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) రెండో రోజు ప్రారంభమయ్యాయి. అయితే, ప్రారంభమైన కాసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మణిపూర్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబడటంతో ఎగువ, దిగువ సభలను వాయిదా వేశారు.
ఉదయం 11 గంటలకు లోక్ సభ (Lok Sabha) ప్రారంభంకాగానే మణిపూర్ అంశం(Manipur issue) పై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. వెల్ లోకి దూసుకెళ్లి నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేస్తారని స్పీకర్ ఓం బిర్లా ఎంత చెప్పినా విపక్షాలు వినిపించుకోలేదు. ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో లోక్ సభ ను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తూ స్పీకర్ ప్రకటించారు.
అటు రాజ్యసభ (Rajya Sabha)లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మణిపూర్ హింస, తాజా అంశాలపై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. అన్ని కార్యకలాపాలనూ పక్కనపెట్టి.. మణిపూర్ అంశంపై మాత్రమే సుదీర్ఘంగా చర్చ చేపట్టాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొనడంతో.. సభను మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ప్రకటించారు.
Also Read..
Heavy Rain Alert | తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Manipur Violence | మణిపూర్ లో అమానవీయ ఘటన.. నిందితుడి ఇంటికి నిప్పు పెట్టిన స్థానికులు
Earthquake | జైపూర్ ను కుదిపేసిన వరుస భూకంపాలు.. అరగంటలో మూడు సార్లు కంపించిన భూమి