Lok Sabha Polls | లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) ఒడిశా (Odisha) రాష్టంలో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. అధికార బిజూ జనతాదళ్ (BJD)తో పొత్తు పెట్టుకుందంటూ వస్తున్న వార్తలపై కమలం పార్టీ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ మన్మోహన్ సమాల్ వెల్లడించారు.
కాగా, ఒడిశాలో (Odisha) పాత మిత్రులు ఒక్కటయ్యారని, 11 సంవత్సరాల తర్వాత అధికార బిజూ జనతాదళ్ (BJD), బీజేపీ మళ్లీ లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీచేయబోతున్నాయంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 21 స్థానాలకు గానూ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీ 13 స్థానాల్లో, బీజేపీ (BJP) 8 చోట్ల పోటీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. బీజేపీ మాత్రం 9 ఎంపీ సీట్లు, 55 అసెంబ్లీ స్థానాలు కోరుతున్నట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుపై ఇరు పార్టీలు ఒక అవగాహనకు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పొత్తుపై బీజేపీ తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఒంటరిగానే పోటీకి దిగనున్నట్లు స్పష్టం చేసింది.
రాష్ట్రంలో బీజేడీ, బీజేపీలు మొదటిసారిగా 1998 ఎన్నికల్లో కలిసి పోటీచేశారు. 11 ఏండ్లపాటు కొనసాగిన ఇరు పార్టీల స్నేహానికి బ్రేక్ పడింది. 2009 ఎన్నికల సందర్భంగా 63 అసెంబ్లీ స్థానాలకు బదులుగా 40 చోట్ల, తొమ్మిది ఎంపీ సీట్లకు బదులు ఆరు స్థానాలే ఇస్తామని కమలం పార్టీకి బీజేడీ ప్రతిపాదించింది. అందుకు ఒప్పుకోని బీజేపీ అధిష్ఠానం ఒటరిగా పోటీచేసింది. దీంతో ఎన్డీఏ నుంచి బీజేడీ వెలుపలికి వచ్చింది. అయినప్పటికీ కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వానికి ఆ పార్టీ మద్దతు తెలుపుతూ వస్తున్నది.
विगत 10 वर्षों से, श्री नवीन पटनायक जी के नेतृत्व में ओडिशा की बीजू जनता दल (बीजेडी) पार्टी केंद्र की माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की सरकार के अनेक राष्ट्रीय महत्व के प्रसंगों में समर्थन देती आई है, इसके लिए हम उनका आभार व्यक्त करते हैं।
अनुभव में आया है कि देशभर…
— Manmohan Samal (Modi Ka Parivar) (@SamalManmohan7) March 22, 2024
Also Read..
Arvind Kejriwal | నా జీవితం దేశానికి అంకితం.. అరెస్ట్ తర్వాత కేజ్రీవాల్ తొలి రియాక్షన్
Deepinder Goyal | మెక్సికన్ మోడల్ను రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్న జొమాటో సీఈవో..!
Arvind Kejriwal | రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ను హాజరుపర్చిన ఈడీ.. తీర్పుపై ఉత్కంఠ