Arvind Kejriwal | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court)లో హాజరుపరిచారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీని నిన్న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ వైద్య పరీక్షల అనంతరం ఆప్ నేతను కోర్టులో ప్రవేశ పెట్టారు.
ఈ మేరకు మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ పాత్రపై ఈడీ కోర్టుకు వివరించింది. 28 పేజీల రిమాండ్ రిపోర్ట్ను ఈడీ కోర్టు ముందు ఉంచింది. సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ఈడీ తరఫున వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో కేజ్రీవాల్ కింగ్పిన్ (Kingpin) అని, మద్యం పాలసీ అమలులో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారని కోర్టుకు వివరించారు.
‘మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ కింగ్పిన్. పాలసీ అమలులో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఇందులో సౌత్ గ్రూప్నకు అనుకూలంగా వ్యవహరించారు. ఇది రూ.వంద కోట్ల స్కామ్ కాదు.. రూ.600 కోట్ల స్కామ్. ఇందులో కేజ్రీవాల్కు రూ.300 కోట్లు అందాయి. పంజాబ్, గోవా ఎన్నికల్లో ఖర్చుపెట్టింది ఈ డబ్బే. రూ.45 కోట్లు హవాలా ద్వారా గోవాకు పంపారు. ఆప్, సౌత్ గ్రూప్ల మధ్య విజయ్నాయర్ వారధిగా ఉన్నాడు. విజయ్ నాయర్ కంపెనీ నుంచి అన్ని ఆధారాలూ సేకరించాం. మా దగ్గర అన్ని ఆధారాలూ ఉన్నాయి’ అని ఈడీ వివరించింది. ఈ కేసులో విచారణ నిమిత్తం కేజ్రీవాల్ను పది రోజులు కస్టడీకి కోరింది. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. న్యాయమూర్తి తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. విచారణ నేపథ్యంలో కోర్టు వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read..
Massive Traffic | ఆప్ నిరసనలతో.. ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్
Arvind Kejriwal | సుప్రీంకోర్టులో పిటిషన్ను వెనక్కి తీసుకున్న కేజ్రీవాల్
Arvind Kejriwal | కేజ్రీ అరెస్ట్కు వ్యతిరేకంగా నిరసనలు.. పోలీసుల అదుపులో ఆప్ మంత్రులు