Pune | చీర కొనలేకపోవడమే ఆ భర్త పాలిట శాపమైంది. చీర కోసం దంపతుల మధ్య జరిగిన గొడవ భర్త ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాదకర సంఘటన మహారాష్ట్రలో(Maharastra) చోటు చేసుకుంది. పోలీసు లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్లోని రోహ్తాస్ జిల్లాకు చెందిన సునీతాదేవి(30) , హరేరా మ్ సింగ్ (35) దంపతులు పుణెలోని బద్లాపూర్ ఈస్ట్లోనివిస్తున్నారు. అయితే తనకు చీరలు కొనలేదనే కోపంతో నీతాదేవి భర్తతో గొడవపడింది. ఈక్రమంలో ప్రెషర్ కుక్కర్ మూతతో(Pressure cooker lid) కొట్టి, గొంతు నులిమి చంపిసేంది.
ఆపై తన భర్త ప్రమాదవశాత్తు చనిపోయాడని నాటకమాడి అందరిని నమ్మించింది. భార్య ఇచ్చిన వాంగ్మూ లం ఆధారంగా పోలీసులు మొదట ప్రమాదవశాత్తు మరణం (Accidental Death)గా కేసు నమోదు చేశారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్లో గొంతు నులమడం వల్ల శ్వాస ఆడక మృతి చెందాడని తేలింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితురాలిని అరెస్ట్ చేశామని బద్లాపూర్ ఈస్ట్ పోలీస్ స్టేషన్కు చెందిన సీనియర్ ఇన్స్పెక్టర్ నితిన్ పాటిల్ తెలిపారు.