జోగులాంబ గద్వాల : తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ ( KCR ) దేనని జోగులాంబ జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు ( Basu Hanumanthu Naidu ) అన్నారు. గద్వాల నియోజకవర్గం కె.టీ.దొడ్డి మండలం మల్లాపురం తండా , గట్టు మండలం వాయిలకుంట తండా గ్రామాలలో కేసీఆర్ చిత్రపటాలకు గిరిజనులతో కలిసి పాలాభిషేకం చేశారు.
ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తండాల్లో గిరిజనులు అసౌకర్యాల మధ్య జీవనం కొనసాగించారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తండాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు.రాష్ట్రంలోని 3,146 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని వెల్లడించారు . ఎస్టీల రిజర్వేషన్లను 6నుంచి 10శాతానికి పెంచారని, గిరిజన విద్యార్థులకు 71 గురుకులాలు ఏర్పాటు చేశారని తెలిపారు. దాదాపు అన్ని గిరిజనతండాలకు తారు రోడ్ల నిర్మాణం చేశారన్నారు.
గిరిజన మహిళల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వంలో అనేక పథకాలను అమలు చేశారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జి.రాఘవేంద్ర రెడ్డి, సర్పంచులు సాకి డేవిడ్, తిమ్మప్ప, మాజీ సర్పంచులు కృష్ణవేణి నరేందర్ నాయక్,లక్ష్మీకాంత్ రెడ్డి, అంగడి బసవరాజ్,పటేల్ జనార్దన్ రెడ్డి, ప్రతాప్, రంగ నాయక్ , బీచుపల్లి, చక్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, బాసు గోపాల్, ఎస్.రాము నాయుడు, టీ.రవి, రాజు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.