Erravelli Survey | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి కిలోమీటర్ దూరంలో సర్వే చేయడానికి రెవెన్యూ అధికారులు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక రైతులు రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. మా భూములు మేము సాగు చేసుకుంటుంటే మీరు ఇప్పుడు ఎందుకు వచ్చి సర్వే చేస్తున్నారు అని వారిని నిలదీశారు.
ఎందుకొచ్చారని రైతులు అడిగితే.. ఈ ల్యాండ్లో 388 ఎకరాల 5 గుంటల ప్రభుత్వ భూమి ఉన్నది.. ఈ భూమి ఎక్కడి నుంచి ఎక్కడివరకుందనేది సర్వే చేయమని కలెక్టర్ ఆదేశించారని రెవెన్యూ అధికారి చెప్పగా.. ఇంతకు ముందు ఎన్నిసార్లు చేసిర్రు. సార్ ఉన్నప్పుడు నాలుగు సార్లు చేసిర్రు.. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఎందుకు సర్వే చేస్తున్నరు అక్కడే ఉన్న ఓ రైతు ప్రశ్నించారు. సర్వే నంబర్లో మన భూమి ఉందా లేదా.. అనేది చూస్తున్నం.. అవన్నీ తర్వాత చెప్తమని సదరు అధికారి సమాధానం చెప్పడాన్ని దాటవేస్తుంటే.. అసెంబ్లీలో నిన్న రేవంత్ రెడ్డి ప్రకటించనట్టుగా చేస్తున్నరా.. మరి దేనికోసం చేస్తున్నరని మాకు డౌట్ ఉంటది కదా అని రైతు అడిగారు.
325 సర్వే నంబర్లో మీకేమైనా సమస్య వచ్చిందా..? వేరేవాళ్లు ఎవరైనా వచ్చి కబ్జా చేసిర్రా.. చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి పంపియగానే వచ్చి నువ్వు సర్వే చేస్తవా..? నిన్న మొన్న లేనిది ఈ రోజు ఎందుకు చేస్తున్నవ్ నువ్.. 325 ఎక్కడకు పోలేదు.. ఇక్కడే ఉంది.. మీరెలాంటి సర్వే చేసేందుకు అధికారం లేదు సార్.. భూములు మావి ఎక్కడికి పోలేదు.. మంచిగనే ఉన్నయ్ సార్.. ఇంతకుముందు ఎర్రవెల్లి ఎట్లుండే.. ఇక్కడ పంటలు పండించుకొని బతికేటోడు ఎవడు వీళ్లకు తెల్వదా అని ప్రశ్నించాడు.
కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి 1 కిలోమీటర్ దూరంలో సర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ అధికారులు
వారిని అడ్డుకున్న స్థానిక రైతులు
మా భూములు మేము సాగు చేసుకుంటుంటే మీరు ఇప్పుడు ఎందుకు వచ్చి సర్వే చేస్తున్నారు అని నిలదీసిన స్థానిక రైతులు pic.twitter.com/ctIlxD3181
— Telugu Scribe (@TeluguScribe) September 17, 2026