Unesco honour | భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీత (Bhagavad Gita)కు యునెస్కో గుర్తింపు (Unesco honour) లభించింది. భగవద్గీతతోపాటు భరతముని రాసిన నాట్య శాస్త్రానికి (Natyashastra) కూడా ఈ గుర్తించి వరించింది.
భారతదేశ సాంస్కృతిక, తాత్విక వారసత్వానికి చారిత్రాత్మక గుర్తింపుగా వీటికి యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ (Unescos Memory of the World Register)లో చోటు దక్కింది. ఈ విషయంపై ప్రధాని మోదీ (PM Modi) సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన క్షణంగా అభివర్ణించారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ క్షణం. యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీత, నాట్యశాస్త్రాన్ని చేర్చడం మన గొప్ప సంస్కృతి, జ్ఞానానికి దక్కిన గుర్తింపు’ అని ప్రధాని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు పెట్టారు.
A proud moment for every Indian across the world!
The inclusion of the Gita and Natyashastra in UNESCO’s Memory of the World Register is a global recognition of our timeless wisdom and rich culture.
The Gita and Natyashastra have nurtured civilisation, and consciousness for… https://t.co/ZPutb5heUT
— Narendra Modi (@narendramodi) April 18, 2025
Also Read..
Trump – Meloni | ట్రంప్తో ఇటలీ ప్రధాని భేటీ.. వాణిజ్య ఒప్పందంపై చర్చ
Jaat Movie: వివాదంలో జాట్ మూవీ.. సన్నీ డియోల్, రణ్దీప్ హూడాపై ఎఫ్ఐఆర్
Urvashi Rautela | ఉత్తరాఖండ్లో నా పేరుతో గుడి ఉంది : ఊర్వశీ రౌతేలా