Mohan Bhagwat | పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనను ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) చీఫ్ (RSS chief) మోహన్ భగవత్ (Mohan Bhagwat) తీవ్రంగా ఖండించారు. ఈ దాడి ధర్మం, అధర్మం మధ్య యుద్ధాన్ని గుర్తు చేస్తోందని వ్యాఖ్యానించారు.
‘దాడి చేసిన వారు మతాన్ని అడిగి ప్రజలను కాల్చి చంపారు. హిందువులు ఎప్పటికీ అలాంటి పని చేయరు. ఇది మన స్వభావం కాదు. ద్వేషం, శత్రుత్వం మన సంస్కృతిలో లేవు. ఈ ఘటన ధర్మం, అధర్మం మధ్య యుద్ధాన్ని గుర్తు చేస్తోంది. రామాయణంలో రావణుడు తన మనసును మార్చుకోవడానికి నిరాకరించాడు. వేరే మార్గం లేక రాముడు అతన్ని చంపాడు. అలాగే కొందరు దుర్మార్గులు మారరు. అలాంటి వారు నశించాల్సిందే. మనం ఐక్యంగా ఉంటే.. ఎవరూ మనపై దాడి చేయడానికి ధైర్యం చేయరు. కానీ కొన్ని చీకటి శక్తులు దేశాన్ని విడదీయడానికి, శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాంటి వారి మీద ధర్మం గెలవాల్సిందే. వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పాల్సిందే’ అని అన్నారు.
Also Read..
Pahalgam Attack | ఉగ్రవాదుల కోసం వేట.. పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు