బెంగళూర్ : రోజంతా పనిచేసి సంపాదించినా కుటుంబ బాధ్యతలను మోయడం ఈ రోజుల్లో భారమవుతున్నది. అలాంటింది ఓ ఆటో డ్రైవర్ ఐదు గంటలు కష్టపడితే కేవలం రూ. 40 దక్కడంతో అతడు కంటతడి పెట్టిన వీడియో (Viral Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఈ వీడియోలో తాను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఎంత కష్టపడినా కేవలం 40 రూపాయలే ఆర్జించానని అతడు విలపిస్తూ చెప్పడం నెటిజన్ల గుండెలను బరువెక్కించింది. కర్నాటక ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అందుబాటులోకి తీసుకురావడంతో తమ పరిస్ధితి దయనీయంగా మారిందని ఆటోడ్రైవర్ వాపోయాడు.
A Bengaluru auto driver in tears after collecting just Rs 40/- from 8 am to 1 pm. This is the result of free bus rides given by the new Cong govt in Karnataka.
Pushing people into poverty. pic.twitter.com/2RZEjA9pw8— Zavier (@ZavierIndia) June 25, 2023
కర్నాటక ప్రభుత్వ నిర్ణయం ప్రజలను పేదరికంలోకి నెట్టివేసిందని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను నెట్టింట షేర్ చేసినప్పటి నుంచి ఏకంగా 1.25 లక్షల మంది వీక్షించగా పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. కొందరు ఆటో డ్రైవర్పై సానుభూతి చూపగా, ఆటోడ్రైవర్లు గమ్యస్ధానాలు ఎంచుకోవడంలో ఆచితూచి వ్యవహరించరాదని, ప్రయాణీకులను గౌరవించాలని మరికొందరు యూజర్లు కామెంట్ చేశారు.
Read More :
Rahul Gandhi | బైక్ మెకానిక్గా మారిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..