Budget 2024 : 2024-25 మధ్యంతర బడ్జెట్లో రైల్వేలకు అసాధారణ రీతిలో బడ్జెట్ కేటాయింపులున్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ గురువారం పేర్కొన్నారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైల్వేలకు ఏకంగా రూ. 2.52 లక్షల కోట్లు కేటాయించారని మంత్రి వివరించారు.
గత పదేండ్లుగా రైల్వే అభివృద్ధి ముఖచిత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సమూలంగా మార్చేశారని, ఇక రైల్వేల ఆధునీకరణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. తమిళనాడులో పలు రైల్వే మౌలిక సదుపాయాలు, భద్రతా ప్రాజెక్టుల కోసం అధికంగా రూ. 6331 కోట్లు కేటాయించారని తెలిపారు. పలు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టుల కోసం భారీ కేటాయింపులు జరిపారని మంత్రి పేర్కొన్నారు. ఇక భారత్ను 2047 నాటికి వికసిత భారత్గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
లోక్సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ సర్కార్ చిట్ట చివరి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆమె పార్లమెంట్లో మాట్లాడుతూ.. దేశ ప్రజల సగటు ఆదాయం 50 శాతం పెరిగిందని అన్నారు. గడిచిన పదేళ్లలో మహిళల సాధికారత పెరిగిందన్నారు. ట్రిపుల్ తలాక్ను చట్టరీత్యా నేరం చేశామన్నారు. ప్రభుత్వ స్కీమ్ కింద 70 శాతం మంది మహిళలకు ఇండ్లు అందజేసినట్లు చెప్పారు.
Read More :