Asaduddin Owaisi : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. సీఏఏను ఎన్పీఆర్, ఎన్ఆర్సీలతో కలిపిచూడాలని అప్పుడే దాన్ని సరిగ్గా అర్ధం చేసుకోగలమని అన్నారు. లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన తీరు ఇవాళ రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు సీఏఏపై కేంద్రం తీరును తేటతెల్లం చేస్తున్నాయని చెప్పారు.
పేదలు, దళితులు, మైనారిటీలు, ముస్లింలను భారత్లో చోటులేకుండా చేయడమే సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీ లక్ష్యమని అసదుద్దీన్ ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక పలు సందర్భాల్లో సీఏఏపై అసదుద్దీన్ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు రాగానే సీఏఏ నిబంధనలు వస్తాయని ఆయన ఇటీవల విమర్శించారు.
పౌరసత్వ సవరణ చట్టంపై తమకు అభ్యంతరాలున్నాయని ఓవైసీ పేర్కొన్నారు. మతం ఆధారంగా కాకుండా హింసకు గురైన వారికి ఆశ్రయం ఇవ్వాలని కేంద్రానికి సూచించారు. సీఏఏ నిబంధనలను ఐదేళ్లుగా ఎందుకు పెండింగ్లో పెట్టారని ప్రశ్నించారు. సీఏఏ ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు. ముస్లింలే లక్ష్యంగా సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ తెచ్చారని ఆయన ఆరోపించారు.
Read More :