Arvind Kejriwal | తాను ద్రవ్యోల్బణానికి (Inflation) వ్యతిరేకంగా ఓటు వేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. లోక్సభ ఎన్నికలకు శనివారం జరుగుతున్న ఆరో విడత పోలింగ్లో కుటుంబ సభ్యులతో కలిసి కేజ్రీవాల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తన తండ్రి, భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఢిల్లీలోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన కేజ్రీవాల్.. అక్కడ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం వెలుపల ఆయన మాట్లాడుతూ.. ‘నా తండ్రి, భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి వచ్చి ఓటు వేశాను. అనారోగ్యం కారణంగా మా అమ్మ పోలింగ్ బూత్ వరకూ రాలేకపోయారు. నేను నియంతృత్వానికి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగానికి (inflation and unemployment) వ్యతిరేకంగా ఓటు వేశాను. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని కేజ్రీవాల్ ఓటర్లకు పిలుపునిచ్చారు.
मैंने अपने पिता, पत्नी और बच्चों के साथ आज वोट डाला। मेरी माता जी की तबियत बहुत ख़राब है। वो नहीं जा पाईं। मैंने तानाशाही, बेरोज़गारी और महंगाई के ख़िलाफ़ वोट डाला। आप भी वोट डालने ज़रूर जाएँ। pic.twitter.com/iCot3wOybH
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 25, 2024
దేశంలోని 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ జరుగుతున్నది. ఈ దశలో మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్సభ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. పొత్తులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ 4, కాంగ్రెస్ 3 స్థానాల్లో అభ్యర్థులు బరిలో నిలిచారు.
#WATCH | After casting his vote, Delhi CM Arvind Kejriwal says, “My father, wife, children and I have voted. My mother could not come today because she is not well. I have voted against dictatorship, inflation and unemployment. I appeal to people to come out and vote…”… pic.twitter.com/9rOlx7CKu0
— ANI (@ANI) May 25, 2024
Also Read..
Kerala | కేరళలో భారీ వర్షాలు.. 11 మంది మృతి.. 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్
Lok Sabha Elections | ఉదయం 11 గంటల వరకు 25.76 శాతం పోలింగ్