Lok Sabha Elections : లోక్సభ ఆరో దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. మొత్తం ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు శనివారం పోలింగ్ జరుగుతున్నది. ఉదయం 11 గంటల వరకు 58 స్థానాల్లో సగటున 25.76 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం డాటాను విడుదల చేసింది.
ఇక రాష్ట్రాల వారీగా చూస్తే.. పశ్చిమబెంగాల్లో అత్యధికంగా 36.88 శాతం పోలింగ్ నమోదు కాగా, ఒడిశాలో అత్యల్పంగా 21.30 శాతం ఓట్లు పోలయ్యాయి. జార్ఖండ్లో 27.80 శాతం, ఉత్తరప్రదేశ్లో 27.06 శాతం, బీహార్లో 23.67 శాతం, జమ్ముకశ్మీర్లో 23.11 శాతం, హర్యానాలో 22.09 శాతం, ఢిల్లీలో 21.69 శాతం పోలింగ్ నమోదైంది.
ఇవాళ ఆరో దశ లోక్సభ ఎన్నికల పోలింగ్తోపాటే ఒడిశా అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్ కూడా జరుగుతున్నది. మొత్తం 147 అసెంబ్ల స్థానాలున్న ఒడిశాలో తొలి రెండు దశల్లో 105 స్థానాలకు పోలింగ్ జరగగా మిగిలిన 42 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ పోలింగ్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా జార్ఖండ్లోని గండీ అసెంబ్లీ స్థానానికి కూడా ఇవాళే ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. గండి నుంచి జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ జెఎంఎం అభ్యర్థిగా బరిలో ఉన్నారు.