Kerala | ఉత్తర భారతదేశం (North India) వడగాలులకు అల్లాడిపోతుండగా.. దక్షిణాది రాష్ట్రమైన కేరళ (Kerala)ను భారీ వర్షాలు (Heavy Rain) ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా కేరళలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తిరువనంతపురం, కొచ్చి, త్రిస్సూర్, కోజికోడ్, ఎర్నాకులం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్ సహా పలు ప్రధాన నగరాలు పూర్తిగా జలమయమయ్యాయి.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (India Meteorological Department) వెల్లడించింది. ఈ మేరకు ఏడు జిల్లాలకు శనివారం ఎల్లో అలర్ట్ జారీ చేసింది (yellow alert issued). తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజా, ఎర్నాకులం, కోజికోడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాలకు ఐఎండీ ఎల్లో హెచ్చరికలు ఇచ్చింది. ఈ జిల్లాల్లో 6 సెంటీమీటర్ల నుంచి 11 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
మరోవైపు భారీ వర్షం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 11 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర రెవెన్యూ మంత్రి కె.రాజన్ (Minister K. Rajan) తెలిపారు. మే 9 నుంచి 23 వరకూ ఈ మరణాలు నమోదైనట్లు చెప్పారు. 11 మందిలో ఆరుగురు నీటిలో గల్లంతై మరణించగా.. క్వారీ ప్రమాదంలో ఇద్దరు, పిడుగుబాటుకు ఇద్దరు, ఇల్లు కూలి ఒకరు మరణించినట్లు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నీటి ప్రవాహాలు, తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
Also Read..
Arvind Kejriwal | భార్య, పిల్లలతో కలిసి ఓటేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్\
Google Maps: గూగుల్ మ్యాప్స్ చూస్తూ డ్రైవింగ్.. నదిలోకి వెళ్లిన హైదరాబాదీ టూరిస్టులు
Blast in Factory | ఛత్తీస్గఢ్లో ఘోరం.. గన్పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు.. 17 మంది దుర్మరణం