Arvind Kejriwal | లోక్సభ ఎన్నికలకు ఆరో విడత పోలింగ్ శనివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. దీంతో పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పలువురు ప్రముఖులు సైతం ఓటేస్తున్నారు.
ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కుటుంబంతో కలిసి రాజధానిలోని (Delhi) పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. తన ఇద్దరు పిల్లలు, భార్య, తండ్రితో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న కేజ్రీవాల్.. అక్కడ తమ అమూల్యమైన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
దేశంలోని 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ జరుగుతున్నది. ఈ దశలో మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్సభ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. పొత్తులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ 4, కాంగ్రెస్ 3 స్థానాల్లో అభ్యర్థులు బరిలో నిలిచారు.
#WATCH | Delhi CM Arvind Kejriwal, his family members show their inked fingers after casting their votes for the sixth phase of #LokSabhaElections2024 at a polling booth in Delhi pic.twitter.com/Za10pO9sW2
— ANI (@ANI) May 25, 2024
#WATCH | Delhi CM Arvind Kejriwal, his wife Sunita Kejriwal cast their votes for the sixth phase of #LokSabhaElections2024 at a polling booth in Delhi pic.twitter.com/2KMyR2JqvO
— ANI (@ANI) May 25, 2024
#WATCH | Delhi CM Arvind Kejriwal along with his family members arrives at a polling booth in Delhi to cast their votes for the sixth phase of #LokSabhaElections2024 pic.twitter.com/LuX0CNLTJT
— ANI (@ANI) May 25, 2024
Also Read..
Jaishankar | కేంద్ర మంత్రి జైశంకర్కు అరుదైన అవకాశం.. ఎన్నికల సంఘం నుంచి సర్టిఫికెట్
Lok Sabha Elections | ప్రశాంతంగా కొనసాగుతున్న ఆరోవిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Droupadi Murmu | ఢిల్లీలో ఓటు వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము