Loksabha Elections 2024 : ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వంలో నియంతృత్వ ధోరణి పెచ్చుమీరిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్లోని లుథియానాలో మంగళవారం జరిగిన టౌన్హాల్ భేటీలో కేజ్రీవాల్ మాట్లాడారు.
రెండ్రోజుల కిందట ఇక్కడకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా జూన్ 4న పంజాబ్ ప్రభుత్వం రద్దవుతుందని, సీఎం పదవి నుంచి భగవంత్ మాన్ను తొలగిస్తామని హెచ్చరించారని అన్నారు. ఉచిత విద్యుత్ను నిలిపివేయాలని వారు కోరుకుంటున్నారని, అందుకే బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయవద్దని కేజ్రీవాల్ ప్రజలకు పిలుపు ఇచ్చారు. ప్రజలందరూ ఆప్నకు ఓటు వేయాలని కోరారు.
కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం జరుగుతున్న ఈ ఎన్నికలు కీలకమైనవని చెప్పారు. కేంద్రంలో మనకు అధికారం ఉంటే మనం మరింత బలోపేతమవుతామని అన్నారు. ఆప్నకు 13 లోక్సభ స్ధానాలు కట్టబెడితే కేంద్రం నుంచి మన హక్కులు సాధించుకోవచ్చని చెప్పారు. కేంద్రంలో నిరంకుశ కాషాయ సర్కార్ను సాగనంపాలని ఆయన పంజాబ్ ప్రజలకు పిలుపు ఇచ్చారు.
Read More :
Ande Sri | కీరవాణిని తలదన్నేటోడు తెలంగాణల ఉన్నడా?