Sikkim | శీతాకాలం కారణంగా ప్రస్తుతం దేశంలో చలి తీవ్రత పెరిగింది. ఇక మంచు అధికంగా కురిసే రాష్ట్రాల్లో అయితే ఉష్ణోగ్రతలకు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. ఈశాన్య రాష్ట్రం సిక్కిం (Sikkim) గత మూడు రోజులుగా భారీ మంచు (snowfall)తో వణికిపోతోంది. మంచు కారణంగా ఎత్తైన ప్రాంతాల్లో సుమారు 800 మందికిపైగా పర్యాటకులు (Tourists) చిక్కుకుపోయారు.
హిమపాతం, ప్రతికూల వాతావరణం (inclement weather) కారణంగా తూర్పు సిక్కింలోని వివిధ ప్రాంతాల్లో వృద్ధులు, మహిళలు, పిల్లలతో సహా సుమారు 800 మందికిపైగా పర్యాటకులు చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వారందరినీ భారత ఆర్మీ (Army) రక్షించింది. వారందరినీ ప్రత్యేక వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో హిమపాతం అధికంగా ఉండటంతో సిక్కిం వచ్చే పర్యాటకులను అధికారులు పలు సూచనలు చేస్తున్నారు.
#WATCH | Troops of the Trishakti Corps Indian Army rescued more than 800 tourists stranded due to snowfall and inclement weather in East Sikkim: Trishakti Corps, Indian Army
(Video Source: Trishakti Corps, Indian Army) pic.twitter.com/zGmdCsnwek
— ANI (@ANI) December 13, 2023
Also Read..
Ind Vs SA T20 | జోరుమిదున్న సఫరీలు.. మరో కీలకపోరుకు సిద్ధమైన భారత్
Sai Pallavi | ఎక్కడున్నా.. గౌరవంగా ఉండాలి.. గౌరవంగానే వెళ్లిపోవాలంటున్న నేచురల్ బ్యూటీ
Anju Kurian | మత్తుకళ్లతో సెగలు పుట్టిస్తున్న అంజు కురియన్..