Army plane | భారత ఆర్మీకి చెందిన ఓ చిన్న విమానానికి (Army plane) పెను ప్రమాదం తప్పింది. ట్రైనింగ్ సెషన్లో ఉండగా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది (mid air glitch). దీంతో విమానం బీహార్ (Bihar)లోని గయ జిల్లాలో మైదానంలో ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు ట్రైనీ పైలట్లు గాయపడ్డారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓటీఏ)కి చెందిన మైక్రోలైట్ ఎయిర్క్రాఫ్ట్ (microlight aircraft) మంగళవారం ఉదయం ట్రైనింగ్ సెషన్లో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ క్రమంలో 9.15 గంటలకు పహార్పూర్లోని మైదానంలో దిగింది. ఆ సమయంలో విమానంలో ఇద్దరు ట్రైనీ పైలట్లు ఉన్నారు. వారిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని గాయపడిన ఇద్దరు పైలట్లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు గయ ఎస్ఎస్పీ ఆశిష్ భారతి తెలిపారు.
A helicopter of the Indian Army’s Officers’ Training Academy in #Bihar‘s #Gaya, with two pilots on board, crashed on Tuesday. The pilots, including a female, survived with minor injuries. pic.twitter.com/7kilpEGPyQ
— Siraj Noorani (@sirajnoorani) March 5, 2024
Also Read..
Vande Bharat | వందేభారత్ రైలులో అందించిన పెరుగులో ఫంగస్.. షాకైన ప్రయాణికుడు
Delhi temperature | ఢిల్లీలో ఐదేళ్ల కనిష్టానికి ఉష్ణోగ్రతలు