Delhi temperature | తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుంటే.. ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం చలికి గజగజ వణుకుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. తాజాగా రాజధాని నగరంలో ఐదేళ్ల కనిష్టానికి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి (Delhi records lowest temperature).
మంగళవారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 9 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. గత ఐదేళ్లలో మార్చి నెలలో ఇంత తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి. అంతకు ముందు 2019 మార్చి 1న దేశ రాజధానిలో 6.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు మార్చి 5న 9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Also Read..
PM Modi | పాకిస్థాన్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్కి మోదీ శుభాకాంక్షలు
Elon Musk | మస్క్ ఔట్.. ప్రపంచ కుబేరుడిగా అవతరించిన జెఫ్ బెజోస్