అభివృద్ధి ప్రధాత ఆడబిడ్డలకు మేనమామ
ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్
కోహెడ, ఏప్రిల్ 6 : సీఎం కేసీఆర్ మాటంటే మాటేనని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ అన్నారు. మంగళవారం మండల కేం ద్రంలోని శ్రీలక్ష్మి గార్డెన్స్లో 125 మంది లబ్ధిదా రులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అలాగే, 25 మంది ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీశ్కుమార్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మాటంటే మాటేనని.. ఇచ్చిన మాటను తప్పక నెరవేరుస్తున్నారన్నారు. కొవిడ్ కారణంగా ఏడాది నష్టం జరిగినా రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకం ఆగలేదని గుర్తు చేశారు. ఆడబిడ్డ పుట్టిందంటే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బాధపడేవారన్నారు… కానీ, సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ఆడపిల్లలకు మేనమామ అయ్యారన్నారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడన్నారు. రైతులు నేడు టీఆర్ఎస్ పాలనలో ఇబ్బందులు లేకుండా కుటుంబంతో హాయిగా ఉంటున్నారని తెలిపారు. అనేక అభివృద్ధి పనులు చేసి అభివృద్ధి ప్రధాతగా నిలుస్తున్నా రని కొనియాడారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో భారీగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, ఎంపీపీ కొక్కుల కీర్తి, జడ్పీటీసీ నాగరాజు శ్యామల, ప్యాక్స్ చైర్మన్ పేర్యాల దేవేందర్రావు, ఏఎమ్సీ చైర్మన్ ఆవుల రాదమ్మ, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ రామాచారి, ఎంపీడీవో శ్రీధర్,తహశీల్దార్ రుక్మిణీ, సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు పేర్యాల నవ్య, నాయకులు తిప్పారపు శ్రీకాంత్, పొన్నాల లక్ష్మణ్, ఆవుల మహేందర్, కోనె శేఖర్, ఇప్పరపల్లి కృష్ణమూర్తి అబ్దుల్ ఖదీర్, భీంరెడ్డి రాజిరెడ్డి, సర్పంచ్లు , ఎంపీటీసీలు పాల్గొన్నారు.