Loksabha Elections 2024 : దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం ఉందని, ఇది రోజురోజుకూ బలపడుతోందని బీజేపీ తమిళనాడు చీఫ్ కే అన్నామలై అన్నారు. జూన్ 4న చారిత్రక ఫలితాలు వెల్లడవుతాయని చెప్పారు. దక్షిణాదిలో మోదీ వేవ్ పార్లమెంట్ ఎన్నికలను ముంచెత్తుతుందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ 50 స్ధానాలలోపు పరిమితమవుతుందని, తాము రికార్డ్ మార్జిన్తో అధికారంలోకి వస్తామని అన్నామలై ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఘన విజయంతో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా పాలనా పగ్గాలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More :
Farooq Abdullah: పాకిస్థాన్ గాజులు తొడుక్కోలేదు: ఫారూక్ అబ్దుల్లా