శ్రీనగర్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ను భారత్లో కలిపేస్తామని ఇటీవల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారూక్ అబ్దుల్లా( Farooq Abdullah) రియాక్ట్ అయ్యారు. పాకిస్థాన్ ఏమీ గాజులు తొడుక్కొని కూర్చోలేదని, ఆ దేశం వద్ద అణుబాంబులు ఉన్నాయని, అవి మన మీద పడుతాయని ఫారూక్ అబ్దుల్లా అన్నారు. రక్షణమంత్రి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన అబ్దుల్లా.. అసలు ఆయన్ను ఎవరూ అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలని, పాకిస్థాన్ గాజులు తొడుక్కొని లేదని, ఆ దేశం వద్ద అణు బాంబులు ఉన్నాయని, దురదృష్టవశాత్తు ఆ బాంబులు మనమీద పడే అవకాశాలు ఉన్నట్లు ఆయన విమర్శించారు. భారత్లో జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న పీవోకే ప్రజలు తమ ప్రాంతాన్ని భారత భూభాగంతో కలపాలని డిమాండ్ చేస్తున్నారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల పేర్కొన్నారు.