Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ వరుసగా మూడోసారి కొలువుతీరుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. వారణాసిలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానున్నాయని, ప్రధాని మోదీ 400కుపైగా సీట్లు సాధించనున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక జూన్ 4 మధ్యాహ్నం రాహుల్ గాంధీ విలేకరుల సమావేశం నిర్వహించి ఈవీఎంల కారణంగానే తాము ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని చెబుతారని ఆయన అంచనా వేశారు.
కాంగ్రెస్ సారధ్యంలోని విపక్ష ఇండియా కూటమికి ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని అమిత్ షా పేర్కొన్నారు. ఓటమి పాలవడంతో దిక్కుతోచని స్ధితిలో విపక్ష కూటమి ఎప్పటిలానే ఈవీఎంలపై నిందలు మోపుతుందని దుయ్యబట్టారు.
Read More :
Watch: బార్లో మద్యం నిరాకరణ.. రైఫిల్తో డీజేను కాల్చి చంపిన వ్యక్తి