న్యూఢిల్లీ : ఈ ఏడాది భానుడి ప్రతాపంపై (heatwave) ఐఎండీ తొలి హెచ్చరిక నేపధ్యంలో అధిక ఉష్ణోగ్రతల నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం మార్గదర్శకాలను జారీ చేసింది.
ఎండలు మండుతున్న క్రమంలో ప్రజలు తగినంతగా నీరు తాగాలని మార్గదర్శకాల్లో సూచించింది. వేడిగాలుల నుంచి ఉపశమనం పొందేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఏం చేయకూడదనే వివరాలతో మార్గదర్శకాలను జారీ చేసింది.
ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) తీసుకోవాలి
మజ్జిగ, నిమ్మరసం, పండ్ల రసాలు తాగాలి
వదులైన కాటన్ దుస్తులు ధరించాలి
గొడుగు, క్యాప్, టవల్తో తలను కవర్ చేసుకోవాలి
చల్లని ప్రదేశాల్లో ఉండేలా చూసుకోవాలి
ఉదయం, సాయంత్రం వేళల్లోనే బయట పనులను చక్కబెట్టుకోవాలి
చేయకూడనివి :
మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య బయటకు రాకూడదు
ఒత్తిడితో కూడిన పనులకు దూరం
చెప్పులు లేకుండా బయటకు రాకూడదు
Read More :