Shimla | ఇటీవలే భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోయిన హిమాచల్ ప్రదేశ్.. ప్రస్తుతం పర్యాటకులతో కళకళలాడుతోంది. క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల నుంచి కొండ ప్రాంతానికి ప్రజలు తరలి వస్తున్నారు (Festive Rush). దీంతో ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన సిమ్లా, మనాలి, కసోల్ తదితర ప్రాంతాల్లో వాహనాల రద్దీ నెలకొంది. కేవలం మూడు రోజుల్లోనే వేల సంఖ్యలో వాహనాలు సిమ్లా (Shimla)లోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు.
ప్రపంచంలోనే అత్యంత పొడవైన రోహ్తంగ్లోని అటల్ సొరంగం (Atal tunnel) గుండా మూడు రోజుల్లో 55,000 కంటే ఎక్కువ వాహనాలు సిమ్లాలోకి ప్రవేశించాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకూ గత 24 గంటల వ్యవధిలో 28,210 వాహనాలు అటల్ సొరంగాన్ని దాటాయి. ఓ వైపు పొగమంచు, మరోవైపు వేల సంఖ్యలో పర్యాటకుల రాకతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పర్యాటకుల తాకిడి పెరగడంతో సిమ్లా పూర్తిగా సందడిగా మారింది. అక్కడి పార్కింగ్ ప్రాంతాలన్నీ పూర్తిగా నిండిపోవడంతో పర్యాటకులు తమ వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. మరోవైపు నూతన సంవత్సర వేడుకల కోసం ఈ వారంలో లక్షకు పైగా వాహనాలు సిమ్లాలోకి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
“Manali at a standstill! As of 3 PM, a surge in tourist numbers has paralyzed traffic. Who’s to blame? CM and ministers encouraged tourists to Himachal, now locals bear the brunt of gridlocked roads. Urgent need for accountable tourism management. #ManaliTrafficUpdate… pic.twitter.com/uudW1F1Q5v
— Nikhil saini (@iNikhilsaini) December 24, 2023
गाड़ी में अंदर बैठकर नया साल बनाने से अच्छा है, रजाई में लेटे लेटे मूंगफली खाते हुए नए साल बनाए pic.twitter.com/ODKE5h18Nt
— Raja Babu (@GaurangBhardwa1) December 24, 2023
Also Read..
Coronavirus | డేంజర్ బెల్స్.. దేశంలో 63 మందికి కొత్త వేరియంట్ జేఎన్.1
Human Trafficking | ఫ్రాన్స్ను వీడేందుకు 303 భారతీయులకు లభించిన అనుమతి.. విమానం ఎటు వెళ్లనుంది..?