Mukesh Ambani | ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత (Reliance Industries Chairman) ముకేశ్ అంబానీ (Mukesh Ambani) భద్రతపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ముకేశ్ అంబానీ (Mukesh Ambani), అతని కుటుంబ సభ్యులకు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ అత్యున్నత Z+ భద్రత (Z Plus Security) కల్పించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అయితే.. ముకేశ్ అంబానీకి భారతదేశం (India) లేదా విదేశాల్లో (Abroad) అత్యున్నత స్థాయి Z+ సెక్యూరిటీని (Z Plus Security) అందించడానికి అయ్యే మొత్తం ఖర్చులు అంబానీనే భరించాలని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు కృష్ణ మురారి, అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
కాగా, అంబానీ సెక్యూరిటీ గురించి త్రిపురకు చెందిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. ఆ పిటిషన్ లో అంబానీ కుటుంబం భద్రత మహారాష్ట్రకు మాత్రమే పరిమితమా? దేశ విదేశాల్లోనూ అమలు చేస్తారా? అన్న అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం.. ముకేశ్ అంబానీ ఇండియాలో ఉన్నప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రత కల్పిస్తుందని పేర్కొంది. ఇక విదేశాలకు వెళ్లినప్పుడు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రతా ఏర్పాట్లను కల్పించాలని సూచించింది.
Also Read..
Train Collision | గ్రీన్లో ఢీకొట్టుకున్న రైళ్లు.. 26 మంది మృతి
ChatGPT | చాట్ జీపీటీకి పోటీగా మస్క్ ఏఐ
Global Warming | భూతాపం ఇప్పుడే కాదు.. 26వేల ఏండ్ల కిందటి నుంచే ఉందట!!
YS Sharmila | ఇదేం భాష?.. వైఎస్ షర్మిలపై మండిపడ్డ హైకోర్టు