Global Warming | సింగపూర్, ఫిబ్రవరి 28: ఆధునిక జీవనశైలి, పారిశ్రామికీకరణ వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడి భూతాపం పెరిగిపోతున్నది. 26 వేల ఏండ్ల క్రితమే భూతాపం సంభవించి సముద్ర మట్టాలు పెరిగిపోయినట్టు సింగపూర్లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ వర్సిటీ పరిశోధకులు తేల్చారు. చరిత్రకు పూర్వ యుగంలో సముద్ర మట్టం పెరుగుదల కారణంగా ఆగ్నేయాసియాలో ప్రజలు వలసపోయినట్టు గుర్తించారు.
26 ఏండ్ల క్రితం మలేయ్ ద్వీపకల్పం, సుమత్రా, బోర్నియో, జావా ద్వీపాలు ‘సుండాలాండ్’ అని పిలిచే దక్షిణాసియా ఖండాంతర షెల్ఫ్లో వర్షారణ్యాలు, తీర ప్రాంత మడ అడవులతో కూడిన పెద్ద భూభాగంగా ఉండేవి. ఇక్కడ భూతాపం వల్ల సముద్ర మట్టం 130 మీటర్లు పెరిగిందని, సుండాలాండ్ను సగం వరకు వరదలు ముంచెత్తాయని పరిశోధకులు గుర్తించారు. దీంతో ల్యాండ్బ్రిడ్జిలు విరిగిపోయాయని, పెద్ద పెద్ద భూభాగాలు చిన్న ద్వీపాలుగా మారిపోయాయని కనుగొన్నారు.