Loksabha Elections 2024 : ఈసారి లోక్సభ ఎన్నికల్లో 400కిపైగా స్ధానాలు గెలుస్తామని బీజేపీ ఊదరగొడుతోందని, అయితే ఆ పార్టీ 400 స్ధానాలు కోల్పోతుందని ఎస్పీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఘజీపూర్లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి అఖిలేష్ మాట్లాడారు.
యూపీలో విపక్ష ఇండియా కూటమి పట్ల ప్రజలు విశేష ఆదరణ కనబరుస్తుండటంతో ఢిల్లీ నుంచి వస్తున్న కాషాయ పాలకులు దిక్కుతోచని స్ధితిలో పడిపోయారని అన్నారు. మోదీ సర్కార్ పట్ల తొలి దశ పోలింగ్లో నెలకొన్న వ్యతిరేకత తుది దశకు చేరేసరికి జనాగ్రహంగా పెల్లుబికిందని చెప్పారు.
బలియా, సేలంపూర్లో ఎస్పీ పట్ల ప్రజలు అత్యంత సానుకూలంగా ఉన్నారని, విపక్ష కూటమికి మద్దతు తెలుపుతూ వారు కేరింతలు కొట్టడాన్ని తాను స్వయంగా చూశానని అఖిలేష్ యాదవ్ వివరించారు. కాషాయ నేతల పాత డైలాగ్లను వినేందుకు ఏ ఒక్కరూ సిద్ధంగా లేరని, ఈ ఎన్నికల్లో వారికి ఘోర పరాజయం తప్పదని చెప్పారు.
Read More :
Kavya Maran | ఫైనల్లో హైదరాబాద్ ఓటమి.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న కావ్య మారన్