Akhilesh Yadav : లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటు సహా ఇతర అంశాల్లో విభేదాలతో విపక్ష ఇండియా కూటమిలో చిచ్చు రేగిన నేపధ్యంలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంబంధించి తనకు ఇప్పటివరకూ ఆహ్వానం అందలేదని పేర్కొన్నారు. ఆహ్వానం కోసం తామెందుకు వేచిచూడాలని ఆయన ప్రశ్నించారు.
రాహుల్ యాత్ర ప్రస్తుతం జార్ఖండ్లో సాగుతుండగా యూపీ సహా పలు రాష్ట్రాల మీదుగా వెళుతూ ముంబైలో ముగియనుంది. రాహుల్ జోడో న్యాయ్ యాత్ర యూపీలో ప్రవేశిస్తే మీరు హాజరవుతారా అని ప్రశ్నించగా అఖిలేష్ బదులిస్తూ ఎన్నో భారీ కార్యక్రమాలు జరుగుతున్నా తమకు ఆహ్వానాలు అందడం లేదని అన్నారు. ఆహ్వానం కోసం తాము ఎందుకు అడగాలని ఆయన ప్రశ్నించారు.
కాగా భారత్ జోడో న్యాయ్ యాత్ర ఆదివారం ధన్బాద్ గుండా జార్ఖండ్లోకి ప్రవేశించింది. ఈ యాత్ర ఫిబ్రవరి 14న యూపీలో ఎంటరవనుంది. 67 రోజుల అనంతరం రాహుల్ యాత్ర మార్చి 20న ముంబైలో ముగుస్తుంది.
Read More :
Arvind Kejriwal | కేజ్రీవాల్ మా నోటీసులను లెక్కచేయడం లేదు.. ఢిల్లీ కోర్టులో ఈడీ ఫిర్యాదు