Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తమ నోటీసులను లెక్కచేయడం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కోర్టుకు వెళ్లింది. ఈ మేరకు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్కు పలుమార్లు నోటీసులు పంపినా ఆయన పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొంది.
ఈడీ పిటిషన్ను రౌజ్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. కేసుకు సంబంధించి ఈడీ సమర్పించిన కొన్ని సబ్మిషన్లను శనివారం పరిశీలించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇప్పటికే ఆప్ నేతలు మనీష్సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్టయ్యారు.