Seema Haider | పబ్జీ (PUBG) ప్రేమ కోసం పాకిస్థాన్ నుంచి భారత్కు అక్రమ మార్గంలో ప్రవేశించిన పాక్ జాతీయురాలు సీమా హైదర్ (Seema Haider).. భారత ప్రధాని మోదీ (Pm Modi), కేంద్ర మంత్రి అమిత్షా (Amit Shah), యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు టాప్ నేతలకు రాఖీలు పంపనున్నట్లు మంగళవారం వెల్లడించింది. ఆగస్టు 30వ తేదీన రక్షాబంధన్ (Rakshabandhan) సందర్భంగా పోస్టు ద్వారా వాటిని పంపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు పోస్టల్ కవర్లో రాఖీతోపాటు కొన్ని స్వీట్లను కూడా ప్యాక్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కాగా, పాక్ జాతీయురాలైన 30 ఏళ్ల సీమా హైదర్.. ఉత్తరప్రదేశ్ కు చెందిన 22 ఏళ్ల సచిన్ మీనా (Sachin Meena)తో పబ్జీ గేమ్ ద్వారా ప్రేమలో పడింది. అతడి కోసం నలుగురు పిల్లలతో సహా పాక్ సరిహద్దును దాటి భారత్ లోకి అక్రమంగా అడుగుపెట్టింది. అనంతరం సచిన్ మీనాను వివాహం చేసుకున్న సీమా.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో నివాసముంటోంది. మరోవైపు భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మామ పాకిస్థాన్ ఆర్మీలో సుబేదార్ కాగా, సోదరుడు కూడా పాక్ ఆర్మీలో సైనికుడని తెలిసింది. ఈ నేపథ్యంలో సీమా హైదర్ను పాకిస్థాన్ స్పైగా అనుమానిస్తున్నారు.
మరోవైపు ఆమె జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం కూడా తెరకెక్కుతోంది. ‘కరాచీ టు నోయిడా’ (Karachi to Noida) పేరుతో అమిత్ జానీ (Amit Jani) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర థీమ్ సాంగ్ (Theme Song) ‘చల్ పడే హైన్ హమ్’ (Chal Pade Hain Hum)ను కూడా మేకర్స్ ఇటీవలే విడుదల చేశారు.
सीमा हैदर ने प्रधानमंत्री मोदी, गृहमंत्री अमित शाह, रक्षा मंत्री राजनाथ सिंह, संघ प्रमुख, योगी आदित्यनाथ को राखी भेजी है। #SeemaHaider
(सॉरी, इस वीडियो को पोस्ट करने से मैं खुद को रोक नहीं पाया ! 😊) pic.twitter.com/mShUhwMFrZ
— Prabhakar Kr Mishra (@PMishra_Journo) August 22, 2023
Also Read..
Onions | అలాంటివారు 4 నెలలు ఉల్లి తినకుంటే ఏమవుతుంది..? మహారాష్ట్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
Chandrayaan-3 | 70 కిలోమీటర్ల దూరం నుంచి జాబిల్లి ఫొటోలు పంపిన ల్యాండర్.. పిక్స్ షేర్ చేసిన ఇస్రో
Samantha | 14 ఏళ్ల తర్వాత మళ్లీ అక్కడికి.. ఆ సినిమాని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయిన సామ్