India Corona | దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 1,500 కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Union Health Ministry) వెల్లడించిన వివరాల ప్రకారం.. 1,28,764 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,580 మందికి పాజిటివ్గా తేలింది. తాజా కేసులతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,49,76,599కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 18,009 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక మహమ్మారి నుంచి ఇప్పటి వరకు 4,44,28,417 మంది కోలుకున్నారు. ఇక 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,753 కి ఎగబాకింది.
ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.04 శాతం మాత్రమే యాక్టివ్గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.77 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,88,357) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
Also Read..
Caste Discrimination | కుల వివక్ష బిల్లుకు కాలిఫోర్నియా సెనేట్ ఆమోదం
Wedding Dress | 50 వేల క్రిస్టల్స్తో ప్రత్యేకంగా వెడ్డింగ్ గౌన్.. వరల్డ్ రికార్డ్
CBSE Class 12 Result | సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల