న్యూఢిల్లీ: పోలీసుల విచారణకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతించాలన్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఓ కేసు విచారణకు భౌతికంగా హాజరు కావాలన్న కలకత్తా హైకోర్ట్ ఆదేశాలను సవాల్ చేస్తూ మహువా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.
తనకు రాజకీయ ప్రత్యర్థుల నుంచి గుడ్లు విసరడం వంటి ప్రమాదాలు ఎదురు కావొచ్చని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో విచారణను తప్పించుకోవడానికి ఒక ఎన్నికైన ప్రజా ప్రతినిధి ప్రత్యేక మినహాయింపు ఎందుకు కోరాలని కోర్టు ఈ సందర్భంగా పిటిషనర్ను ప్రశ్నించింది. ‘మన స్వాతంత్య్ర సమరయోధులు తూటాలకు ఛాతిని ఎదురొడ్డారు. రాజకీయాల్లోకి దూకిన మీరు గుడ్లకు భయపడుతున్నారా?’ అని జస్టిస్ దత్తా వ్యాఖ్యానించారు.